ఈకాలం - పొలిటికల్ న్యూస్ / ఆదిలాబాద్ : ఈకాలం న్యూస్ ఆదిలాబాద్ : గ్రామీణీలకు తీవ్రమైన చలినుంచి విముక్తి కలిగించే దిశగా ఆదిత్య కందేశ్కర్ సొసైటీ అడుగులేస్తోంది. ఈ నేపథ్యంలో జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని వృద్ధులకు, చిన్న పిల్లలకి దుప్పట్లు, స్వెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ ఆదిత్య కన్దేస్కర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రమైన దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో సాయి గుండావార్, సందీప్ శర్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
.
EekalamAdmin